పిల్లల కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పధకం, దాని ప్రయోజనాలు: 10 కీలక అంశాలను తెలుసుకోండి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిల్లల కోసం పీఎం కేర్స్ పథకం కింద పలు ప్రయోజనాలను ప్రకటించారు. దీనిలో అర్హత కలిగిన చిన్నారులు ఇరవై మూడు సంవత్సరాలు నిండిన తర్వాత రూ. 10 లక్షలు పొందుతారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నేపధ్యంలో, అసలు పిల్లల కోసం ఉద్దేశించిన PM కేర్స్ పథకం అంటే ఏమిటి మరియు దాని ప్రయోజనాలు ఏమిటి అనే విషయమై 10 కీలక అంశాలు.. మీ కోసం..
1. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ లక్ష్యం ఏమిటంటే, పిల్లలకు నివాసభో, వసతి సౌకర్యాలు కల్పించడం, విద్య ఇంకా స్కాలర్షిప్ల ద్వారా వారికి సాధికారత కల్పించడం. ఆర్థిక సహాయం అందచేయడం ద్వారా స్వయం సమృద్ధి దిశగా వారిని సన్నద్ధం చేయడం 23 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు వారికి సమగ్ర సంరక్షణ అందించడం. ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సుకు భరోసా అందచేయడం.
2. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనాను మహమ్మారిగా ప్రకటించిన 11.03.2020 తేదీ నుండి 28.02.2022 వరకు COVID 19 కారణంగా i) తల్లి, తండ్రి ఇద్దరు ii) తల్లిదండ్రులలో ఏ ఒక్కరు లేదా iii) చట్టపరమైన సంరక్షకులు/దత్తత తీసుకున్న తల్లిదండ్రులు మరణించిన చిన్నారులకు ఈ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ వర్తిస్తుంది.
3. ఈ పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు తల్లిదండ్రులు మరణించిన తేదీ నాటికి పిల్లలకు 18 ఏళ్లు నిండి ఉండకూడదు.
4. కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తగినంత ఆర్థిక సహాయం ద్వారా సమగ్ర సంరక్షణ మరియు రక్షణ, ఆరోగ్య బీమా ద్వారా వారికి నిరంతర శ్రేయస్సును అందించడం, 23 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి విద్య ద్వారా వారిని శక్తివంతం చేయడం మరియు స్వీయ-సన్నద్ధం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.
5. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అర్హులైన పిల్లలకు ఏకీకృత విధానం ద్వారా విద్య, ఆరోగ్యం అందించడమే కాకుండా , 18 సంవత్సరాల వయస్సు నుండి నెలవారీ స్టైఫండ్ మరియు 23 ఏళ్లు నిండినప్పుడు ఏకమొత్తంగా రూ. 10 లక్షలను అందిస్తుంది.
6. లబ్దిదారులైన చిన్నారుల పేరుపై పోస్టాఫీసు ఖాతాను తెరుస్తారు. 23 సంవత్సరాల వయసు వచ్చాక వివరాలు ధృవీకరించిన అనంతరం సదరు మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయబడుతుంది.
7. పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్తో పాటు, PM కేర్స్ పథకం కింద పిల్లలకు ఉచిత ప్రాథమిక పాఠశాల విద్య, ఉచిత ఉన్నత పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యకు మద్దతు కూడా ఈ పధకం ద్వారా లభిస్తుంది.
8. ఈ పథక౦ ఆన్లైన్ పోర్టల్ https://pmcaresforchildren.in ద్వారా అందుబాటులో ఉంటుంది. ఏ పౌరుడైనా అర్హత ఉన్న పిల్లలకు మద్దతుగా గురించి ప్రభుత్వానికి సమాచారమివ్వచ్చు.
9. PM కేర్స్ పోర్టల్ అనేది సింగిల్ విండో సిస్టమ్. ఇది అర్హులైన పిల్లల కోసం అనుమతులున్ జారీ చేయడంతో పాటు అన్నివిధాల ఇతర సహాయాన్ని సులభతరం చేస్తుంది.
10. ఇక, దేశంలోని పిల్లలందరూ ఆయుష్మాన్ భారత్ పథకం (PM-JAY) కింద రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీతో లబ్ధిదారులుగా నమోదు చేయబడతారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద గుర్తించబడిన పిల్లలు PM-JAY కింద ప్రయోజనాలను పొందారని నిర్ధారించుకోవాలి.
పై సమాచారం మీకు నచ్చిందా.. మీకు తెలిసిన మరిన్ని వివరాలు అందరితో పంచుకోవాలనుకుంటున్నారా.. ఎందుకాలస్యం.. ఈ కింద ఉన్న కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి!
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...