తల్లి పాలు ఇవ్వడం వలన తల్లికి , శిశువుకి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.

All age groups

Aparna Reddy

2.6M వీక్షణలు

3 years ago

 తల్లి పాలు ఇవ్వడం వలన తల్లికి , శిశువుకి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.

నవమాసాలు మోసి తల్లి తన రక్తమాంసాలను పంచి ఇచ్చి శిశువుకు జన్మనిస్తుంది. తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. అనంతరం శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావడం ప్రారంభమవుతాయి. సృష్టి కార్యంలో ఈ ప్రక్రియ ఓ భాగంగా కొనసాగుతూ వస్తోంది. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికం. సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఇద్దరికీ ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది.

Advertisement - Continue Reading Below

తల్లిపాలు తాగడం వలన శిశువుకు కలిగే లాభాలు :

పిల్లల తెలివి తేటలను పెంచుతంది. తల్లి పాలలో చాలా ఫాటీ ఆసిడ్స్ ఉన్నందున, ఇవి పిల్లలలో మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతంది. తల్లి పాలు అనుకూలమైనవి. ఇందుకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అతి ముఖ్యమైన విషయం, తల్లి బిడ్డల మధ్య భాంధవ్యం పెరుగుతుంది. తల్లి ఓడిలో బిడ్డ ఉన్నందున బిడ్డ  చాలా అనుకూలమైన స్ధితిలో ఉంటుంది. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికం .తల్లిపాలే శ్రేయస్కరం.

శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు , విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. దీనివలన బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల అవుతంది. బిడ్డకు మలబద్దక సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవి సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి కలిగే లాభాలు :

తల్లిపాలు ఇచ్చినందు వలన తల్లికి ప్రసవానంతర సమయంలో బరువు తగ్గుటకు దోహదపడుతుంది. మానసిక వత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రవాన్ని తగ్గిస్తుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది. రొమ్ము వాపు నొప్పిని తగ్గించి బాలింత దశలో రక్తస్రవాన్ని తగ్గిస్తుంది. ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలు ఇస్తే అంత మంచిది. తల్లిపాలవలన-స్ధూలకాయం ఉండదు అని శాస్త్రవేత్తల  పరిశోధన వలన తెలుస్తుంది. తల్లిపాలు ఇవ్వడం వలన లుకేమియా వ్యాధి రాకుండాను , అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి పెద్దవయస్సులో రాకుండా కాపాడుతుంది.

ఎప్పుటి నుండి తల్లి పాలు మొదలు పెట్టాలి :

ప్రసవం అయిన వెంటనే ఎంత తొందరగా మొదలు పెడితే అంతమంచిది. ప్రసవం అయిన వెంటనే శిశువును శుభ్రపరిచిన వెంటనే తల్లి చర్మం తగులునట్లు, తల్లి రోమ్ములకు దగ్గరలో బిడ్డను ఉంచినట్లయితే బిడ్డ శరీర ఉష్ణోగ్రత పెంచుతుంది. తల్లి పాలు వచ్చుటకు ప్రేరేపణ జరుగుతంది. తల్లీ బిడ్డల మద్య ప్రేమ పెరుగుతుంది. 

శిశువుకు జన్మనిచ్చిన కొంతసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్క రం. సాధారణ కాన్పు జరిగిన వారు ఒకటి , రెండు గంటల్లోపే , సిజేరియన్‌ జరిగిన వారికి నొప్పి తగ్గిన 4,5 గంటల్లోపే బిడ్డకు పాలివ్వవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యంగా , అవసరమైన బరువు పెరగగలుగు తుంది. దీంతో పిల్లలకు విరోచనాలు సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు. తల్లి పాలు పిల్లకు తొందరగా జీర్ణమవుతాయి. తల్లిపాలల్లో ప్రోటీన్లు , విటమిన్లు , కార్బోహైడ్రేట్లు , మినరల్స్‌ , కాల్షియం , పొటాషియం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగగలుగుతుంది.

తల్లి పాలను ఇవ్వడం ఎప్పుడు మొదలు పెట్టాలి :

శిశువు పుట్టిన మొదటి 30 నుండి 60 నిమిషాలు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో పాలు చీకటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. వెంటనే తల్లి పాలు ఇవ్వటం వలన, అదికూడా కోలాస్ట్రం మెట్టమొదట వచ్చే పాలలో ఉంటుది. ఇది త్రాగించటం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులనుండి దూరంగా ఉంచుతుంది. ఇది ఒక టానిక్ లా పనిచేస్తుంది. తల్లులు ఆపరేషన్ ద్వారా కానుపు అయినాకాని, తల్లిపాలు 4గంటల తరువాత ఇవ్వవచ్చు. తల్లిని ఒక ప్రక్కకు త్రిప్పి పాలు పట్టించవచ్చు.

Advertisement - Continue Reading Below

ఎంతకాలం వరకు తల్లిపాలను ఇవ్వవచ్చు :

మొదట 6నెలలు ప్రత్యేకం.ఆ తరువాత రెండు సంవత్సరాల వరకు ఆపైన కూడా ఇవ్వవచ్చు.

తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. అనారోగ్యంగా ఉన్న తల్లి కూడ పాలు ఇవ్వవచ్చును. టైఫాయిడ్, మలేరియా, టిబీ, లాంటి సమయంలో కూడా ఇవ్వవచ్చు.

కానీ కొందరు తల్లులు బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువు , ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టిన కొంతసేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం.

ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు , పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాన్ని అందజేయడం మంచిది.  బిడ్డకు ప్రతి రెండు , మూడు గం టలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే నాలుగు గంటల కైనా పాలివ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం అయిదు నిమిషాలైన పాలి వ్వాలి. పెరుగుతూ ఉండే శిశువుకైతే 10,15 నిమిషాల పాటు పాలిస్తే మంచిది. కడుపునిండా పాలు తాగగానే పిల్లలు వెంటనే పడుకుంటారు.తల్లి పాలిచ్చినా ఇంకా ఏడుస్తుంటే బిడ్డకు పాలు సరిపో లేదన్న విషయాన్ని గమనించి బాటిల్‌తో పాలు తాగించాలి. 

తల్లి పాలిచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రయోజనాలు :

తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్‌తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైర స్‌ ఇన్‌ఫెక్షన్స్‌ , అలర్జీ రాకుండా ఉంటాయి. ఈ పాలల్లో ప్రొటెక్టివ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. దీంతో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బా పాలివ్వడానికి సమయం పడుతుంది.బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేస్తుంటే స్ర్తీలకు వెంటనే ప్రెగ్నెన్నీ రాకుండా నిరోధిస్తుంది. పాలివ్వడం మూలంగా తల్లిలో యూటెరస్‌ తిరిగి మామూలు సైజు కు చేరుకుంటుంది.

మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలిచ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి. 7,8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీనివల్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయ త్నించాలి. బిడ్డకు పాలిచ్చే బ్రెస్ట్‌ నిపుల్‌ను కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నిపుల్‌ వెనక్కి ఉంటే పుట్టిన బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరిచేయాలి. పాలిచ్చేటప్పుడు నిపుల్‌ చుట్టూ శుభ్ర పర్చుకోవాలలి.

పాల ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షి యం , ఇతర మందులను అందజేస్తారు. ఈ మహిళలు ఎక్కువ క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు , విటమిన్లతో కూడిన ఆహారంతో పాటు పాలు , బ్రెడ్‌ , రొట్టెలు తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. పిల్లలకు పాలివ్వడంలో ఎటువంటి టెన్షన్‌ పడకూ డదు. ప్రశాంతంగా పాలిస్తేనే తల్లి బిడ్డకు సక్రమంగా పాలివ్వగల్గుతుంది. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు తల్లి బిడ్డకు తగినంత పాలివ్వగల్గుతుంది. తల్లి పాలు కడుపు నిండా తాగిన పిల్లలు అవసరమైన బరువు పెరుగుతారు. కొందరు తమ బిడ్డకు ఎక్కువగా పాలిస్తారు. ఇది మంచిదికాదు. దీంతో శిశువుకు వాంతులు రావడం జరుగుతుంది.

పరిస్థితులలో తల్లిపాలు బిడ్డకు ఇవ్వకూడదు :

బ్రెస్ట్‌లో ఇన్‌ఫెక్షన్‌ , గడ్డలు ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సరిగా పాలివ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడే వెంటనే డాక్టర్‌తో చికిత్స చేయించు కోవాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు పట్టేసి పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించాలి. తల్లిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు సోకవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలి.

తీవ్రమైన గుండె వ్యాధుతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్‌ తో సైకోస్‌గా మారిన వారు సైతం తమ పిల్ల లకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటు వంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం శ్రేయస్కరం.

తల్లి పాల తో వచ్చిన ఈ బ్లాగ్ మీకు ఉపయోగకరంగా ఉందా!  దయచేసి మీ సూచనలను మరియు అభిప్రాయాలను ఈ క్రింది వ్యాఖ్యల విభాగంలో మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవడం మాకెంతో సంతోషం.

Be the first to support

Be the first to share

support-icon
Support
share-icon
Share

Comment (0)

share-icon

Related Blogs & Vlogs

No related events found.

Loading more...