క్రమశిక్షనే పునాది

శిశువు పుట్టినప్పుడు సంతోషంతో పాటు బరువైన బాధ్యతలు కూడా వస్తాయి. పసికందు ఆరోగ్యంగా ఎదగాలంటే, క్రమంగా మంచి పోషకాహారం అందాలి. అలాగే, పిల్లలు సత్యారాధనలో స్థిరంగా నిలబడాలంటే వాళ్లకు ఆధ్యాత్మిక పోషణ, దైవిక సూత్రాలను పెంపొందించడానికి ప్రయాసపడే తల్లిదండ్రుల దిశానిర్దేశాలు అవసరం.
తమ పిల్లలకు శైశవ దశ నుండి శిక్షణ ఇచ్చేలా తల్లిదండ్రులు ప్రార్థించాలి, ముందుగానే చక్కని ప్రణాళిక వేసుకోవాలి. “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని సామెత గుర్తు చేసుకోవాలి . శిశువు పుట్టకముందే తల్లిదండ్రులు ఖచ్చితంగా వాడి పెంపకం గురించి జాగ్రత్తగా సిద్ధపడతారు. బహుశా తల్లిదండ్రులు తమ శిశువుకు అవసరమైనవాటిని కూడా ముందుగానే రాసి పెట్టుకుంటారు. అయితే, వాళ్లు ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి కూడా ముందుగానే ప్రణాళిక వేసుకోవడం ప్రాముఖ్యం. తమ బాబు/పాప పసికందుగా ఉన్నప్పటి నుండే శిక్షణ ఇవ్వడాన్ని తల్లిదండ్రులు లక్ష్యంగా పెట్టుకోవాలి.
శిశువు పుట్టిన తర్వాతి కొన్ని నెలలు, ఆ శిశువు మెదడు ఎదుగుదలకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యమైన నెలలు. ఆ నెలల్లో, నేర్చుకోవడానికి తోడ్పడే నాడీకణాల మధ్య ఉండే సంధుల సంఖ్య ఇరవై రెట్లు అధికమౌతుంది.శిశువు మానసిక ఎదుగుదలకు సంబంధించిన ఆ కొద్ది కాలాన్ని తల్లిదండ్రులు చక్కగా ఉపయోగించుకొని ఆ పసికందు మనసులో ఆధ్యాత్మిక విషయాల్ని నాటడాన్ని మొదలుపెట్టడం ఎంత జ్ఞానయుక్తం.
పిల్లల్ని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని మనం తప్పక కోరుకుంటాం. అయితే, మన పిల్లలకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు, వాళ్ల హృదయాల్లో దేవునిపై ప్రేమను పెంపొందించాలన్నదే మన ప్రాథమిక లక్ష్యం.
పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులంటారు. క్రమశిక్షణ మొదలు, కొన్ని నియమాలు పాటించడం.ఇలా ప్రతిదీ తల్లిదండ్రుల నుంచే పిల్లల్ని చూసి నేర్చుకుంటారు. అందుకే వాళ్లు ఎదిగేకొద్దీ పెద్దవాళ్లు చేయకూడని పనులు కొన్ని ఉంటాయంటారు.
పిల్లలు వేసుకునే దుస్తులూ, చేసుకునే అలంకరణను బట్టీ మన ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుందనేది పిల్లలకు.
తెలియకుండానే అందిస్తుంటాం చాలా సందర్భాల్లో. ఎలాగంటే మనల్ని మనం చూసుకుని ‘ఇవాళ అస్సలు బాగాలేను.. ఈ డ్రెస్ లేదా చీర నాకు నప్పలేదు, బాగా లావైపోతున్నాను..’ అని మనల్ని మనం అనుకుంటుంటే పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు గమనిస్తారు. దాంతో ఆకట్టుకునేలా కనిపించడం తప్పనిసరి అని అనుకుంటారు. అలా భావించడమే కాదు, ఎదిగేకొద్దీ డైటింగ్, ఫ్యాషన్లకు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏ మాత్రం ఆందోళనగా అనిపించినా, ఒత్తిడికి గురైనా ఏదో ఒకటి తినేయడాన్ని ఎమోషనల్ ఈటింగ్ అంటారు. అది చూసే పిల్లలు ఒత్తిడి లేదా ఆందోళన నుంచి మానసిక సాంత్వన కలగాలంటే ఏదో ఒకటి తినాలనుకుంటారు. ఇకపై కోపాన్ని నియంత్రించుకోవాలనుకున్నా, ఆందోళన తగ్గించుకోవడానికైనా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టండం మంచిది. ముఖ్యంగా అలాంటి సమయాల్లో స్నేహితులతో మాట్లాడం, కాసేపు నడవడం, మీకు నచ్చిన అభిరుచిలో లీనం అవగాహన అవటం ఇలా చేస్తే క్రమంగా పిల్లలూ వాటినే పాటిస్తారు.
కంప్యూటరు లేదా టీవీ ముందు ఎక్కువసేపు గడిపే పిల్లలు నిద్రలేమితో బాధపడటంతో పాటూ చదువుల్లోనూ వెనుకబడి ఉంటారనీ, బరువూ పెరుగుతారని ఎన్నో అధ్యయనంలో వెల్లడైంది .తల్లిదండ్రులు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడూ, కలిసి భోజనం చేస్తున్నప్పుడు టీవీ చూడటం, ల్యాప్టాప్ని పక్కన పెట్టుకోవడం వంటివాటికి దూరంగా ఉండండి. పిల్లలకూ ఆ విధంగా జాగ్రత్త చెప్పండి.
చిన్నపుడే వారికి మంచి క్రమశిక్షణతో దైనందిన జీవితం అలవరిస్తే, పెద్దవారైన తర్వాత కూడా అదే అలవాట్లలో కొనసాగి వారి జీవితం సుఖమయం చేసుకుంటారు.
పిల్లల ముందు ఒక పుస్తకాన్ని పెద్దగా చదివితే వారిలో ఎన్నో మార్పులు గమనించచ్చు. బిడ్డకు వినికిడి, సంభాషణ అంటే ఏమిటో బోధించినవారవుతారు. కధలు, నెంబర్లు, లెట్ర్లు, రంగులు, ఆకారాలు వంటివి తెలుపండి. బిడ్డ వినటం, గుర్తుపెట్టుకోవడం, మాటలు నేర్చే నిపుణత పెరుగుతుంది . వారి చుట్టూ వున్న ప్రపంచంవారికి తెలియచెపుతారు. ఒక సంవత్సరం లేదా మొదటి జన్మదినం వచ్చేసరికి వారు మాతృ భాషలో మాట్లాడేందుకు అనువైన శబ్దాలు అన్ని వినివుంటారు. మీరు పెద్దగా ఎన్ని కధలు చదివితే, అతనికి అన్ని మాటలు మాట్లాడే నైపుణ్యతకు గురిచేయబడతాడతారు . బేబీ బ్రెయిన్ లో మాటల శబ్దాలు పెట్టాలంటే, వారు వినాలి. రెండు సంవత్సరాలు వచ్చేసరికి, చదివేటపుడు వినని పిల్లలకంటే కూడా విన్న పిల్లలు అధిక మాటలు తెలుసుకుంటారు. మరి అంత త్వరగా వినటం నేర్చుకున్న పిల్లలు, సరైన వయసుకి చదువులకు మరింత మెరుగుగా వచ్చేస్తారు. తల్లిదండ్రులు చదివేటపుడు బిడ్డ వివిధ భావాలను వెల్లడించే శబ్దాలను గ్రహిస్తారు . సామాజిక తీరుకు కూడా ఉపయోగపడుతుంది. చదివేటపుడు, ఆ పుస్తకంలోని బొమ్మలు చూడటం, వేలుపెట్టి చూపటం, ముట్టుకోవడం వంటివి చేసి వారి ఆలోచనా నైపుణ్యతలు తెలుసుకుంటారు . శబ్దాలను అనుకరిస్తూ, బొమ్మలను గుర్తిస్తూ, మాటలు నేర్చుకుంటూ భాషా పటిమ పెంచుకుంటూరు . ఈ రకంగా బిడ్డకు పెద్దగా చదివి వినిపించటంలో ప్రధానమైనది బిడ్డకు తలిదండ్రులకు మధ్య సంబంధం, సన్నిహితం ఏర్పడి బాగా ప్రేమించ గలుతారు . మీ గొంతు, మీ చేష్టలు అతను ఇష్టపడతారు . చదువు అనేది నేర్చుకోదగినది అనేదితెలుస్తుంది. అంత చిన్న పిల్లలకు పుస్తకంలో బొమ్మ అంటే ఏమిటో కూడా తెలియదు. కాని వాటిని ప్రత్యేకించి వాటి ముఖాలు, మంచి రంగులు, మొదలైనవి చూస్తారు. లాలి పాటలు పాడడం , నర్సరీ పద్యాలు వినిపించడం . అవి శిశువుకు ఎంతో హాయిని గొల్పుతాయి. పుస్తకంపై బిడ్డకు గల ఆసక్తిని ఆ దశలో తల్లిదండ్రులు చాలా బాగా ఆనందిస్తారు.
శైశవ దశలో శిక్షణ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదేమైనా, తమ పిల్లలకు ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వడం తల్లిదండ్రులకు కాస్త సవాలుతో కూడుకున్న పనే.
Be the first to support
Be the first to share
Comment (0)
Related Blogs & Vlogs
No related events found.
Loading more...